పిల్లకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే మతితప్పి వారితో అనుచితంగా ప్రవర్తించాడు. రోజూ స్కూల్కు తాగి వస్తూ, సెల్ఫోన్లో పాటలు పెట్టి విద్యార్థులతో డ్యాన్స్లు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే, బలరాంపూర్ జిల్లా వాడ్రాఫ్నగర్ పరిధిలోని పశుపతిపూర్ ప్రాథమిక పాఠశాలలో లక్ష్మీ నారాయణ్ సింగ్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన ఇతను తరచూ తాగి వచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇటీవల ఒక రోజు తాగి వచ్చి తన మొబైల్ ఫోన్లో పాటలు పెట్టి, విద్యార్థినులతో కలిసి అనుచితంగా డ్యాన్స్ చేశాడు.
దీన్ని గమనించిన స్కూల్లో పనిచేస్తున్న ఓ సిబ్బంది అతను విద్యార్థులతో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో కాస్తా వైరల్గా మారి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఎలాగో ఉపాధ్యాయుడి బండారం బయటపడడంతో అతని చేసే అడగాలను విద్యార్థులు అధికారులకు వివరించారు. లక్ష్మీ నారాయణ్ సింగ్ రోజూ తాగి వస్తూ తమను ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు.
వీడియో చూడండి..
शराब के नशे में धुत वाड्रफनगर स्कूल के शिक्षक को याद आया अपना बचपन, स्कूली बच्चों के साथ किया जमकर डांस #vayamchhattisgarh #DrunkTeacher#SchoolDanceDrama #TeacherGoneViral #vayamcg #chhattisgarh #balrampur #wadrafnagar #diogojota #Railway_Reform #Pawanakalyan pic.twitter.com/j73zXm32MC
— Vayam Chhattisgarh (@Chhattisgarh_36) July 4, 2025
ఇక ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారి (డీఈవో) డీఎన్ మిశ్రా ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నారాయణ్ సింగ్పై చర్యలు తీసుకున్నాడు. అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శకుంతల పోర్టే కూడా స్పందించారు. నారాయణ్ సింగ్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి నీచమైన పనులు చేసినందుకు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.