ప్రేమికుల రోజు వచ్చేసింది. ఈ క్రమంలో తమ ప్రేయసి లేదా భాగస్వామిని ఎలా ఇంప్రెస్ చేయాలా అని అంతా ఆలోచిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఖరీదైన బహుమతుల కంటే ట్రావెలింగ్ కే యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రముఖ ట్రావెల్ ప్లాట్ఫారమ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. దాదాపు 86 శాతం మంది ఇండియన్స్ తమ భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేయడాన్ని అత్యంత సెక్సీ అండ్ రొమాంటిక్ జెస్టర్గా భావిస్తున్నారట.
సర్వేలోని ముఖ్యాంశాలు:
86 శాతం మంది భారతీయులు వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఇది బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని వారు నమ్ముతున్నారు. బిజీ లైఫ్ స్టైల్ వల్ల దొరకని క్వాలిటీ టైమ్ ను ట్రిప్స్ ద్వారా పొందవచ్చని మెజారిటీ జంటలు అభిప్రాయపడుతున్నాయి. ఒకప్పుడు కేవలం డిన్నర్ డేట్స్ లేదా మూవీస్ కే పరిమితమైన రొమాన్స్, ఇప్పుడు అడ్వెంచర్ ట్రిప్స్, బీచ్ రిసార్ట్స్ వైపు మళ్లింది.
ఈ సర్వే ప్రకారం ప్రయాణాలు చేయడం వల్ల భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. కొత్త ప్రదేశాలను అన్వేషించే క్రమంలో ఒకరి గురించి ఒకరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫిజికల్ గిఫ్ట్స్ కంటే ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కే జనం జై కొడుతున్నారు.
ప్రేమికుల రోజున కేవలం వస్తువులు ఇవ్వడం కంటే మధురమైన జ్ఞాపకాలను మిగిల్చే ట్రిప్ ప్లాన్ చేయడం గొప్ప విషయం అని సర్వేలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గోవా, రాజస్థాన్ లోని ఉదయ్పూర్, కేరళ బ్యాక్ వాటర్స్ వంటి ప్రదేశాలకు భారతీయులు క్యూ కడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా మాల్దీవులు, థాయ్లాండ్ వంటి దేశాలకు డిమాండ్ పెరిగింది. కాబట్టి ఈ వాలెంటైన్స్ డేకి మీరు కూడా మీ పార్ట్నర్ను సప్రైజ్ చేయాలనుకుంటే.. ఓ మంచి ట్రిప్ ప్లాన్ చేసేయండి మరి!
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.