సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేకాకుండా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు కొత్త పోర్టల్, యాప్ను కూడా ప్రవేశపెట్టింది. ఇక స్పామ్ కాల్స్ ద్వారా సైబర్ క్రిమినల్స్ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. లోన్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ కేవైసీ అప్డేట్ పేరుతో ప్రజల బ్యాంక్ వివరాలు, ఓటీపీ తెలుసుకుని సొమ్ము కాజేస్తున్నారు.