ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు సాయాజీ షిండే. తన అద్బుత నటనతో లెక్కలేనన్నీ పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, హిందీ తదితర భాషల్లోన షిండే సినిమాలు చేశారు. ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోన్న సాయాజీ షిండే పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ నటుడిని మెచ్చుకుంటూ తెగ పోస్టులు షేర్ అవుతున్నాయి. ఇంతకీ సాయాజీ షిండే ఏం చేశారో తెలుసా? తన తల్లిని ఎంతో ప్రేమించే ఈ నటుడు తన సొంత గ్రామంలో 5000 మొక్కలను నాటారట. ఇప్పుడు ఆ మొక్కలు వృక్షాలుగా మారి ఆ ప్రాంతమంతా ఒక పచ్చని అడవిలా మారిపోయిందట. సహ్యాద్రి దేవ్ రాయ్ ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాయాజీ షిండే తన గ్రామంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో లక్షలాది మొక్కలు నాటారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘ మా అమ్మకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. అమ్మ చనిపోయినప్పుడు తన ఫోటో ఒక విగ్రహానికి తనని పరిమితం చేయటం ఇష్టం లేదు. అందుకే అమ్మకు ఎంతో ఇష్టమైన మొక్కలను నాటాను. ప్రతి మొక్క అమ్మ పేరు మీద నాటారు. ఇప్పుడు ఆ చెట్లలోనే మా అమ్మను చూసుకుంటున్నాను. ఈ మొక్కలున్నీ పెరిగి పెద్దయిన తర్వాత చెట్ల నుంచి వస్తున్న గాలి నీడ మా అమ్మ ఆశీస్సులుగా భావిస్తున్నాను’ అని అంటారు సాయాజీ షిండే.
ఇవి కూడా చదవండి
తల్లితో సాయాజీ షిండే..
కాగా ఈ టాలీవుడ్ నటుడు కేవలం తన తల్లి కోసమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్నేళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటుతున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన చెట్ల జాతులను కాపాడుతూ వస్తున్నారు. దీంతో ఈ నటుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ‘మీరు సినిమాలో విలన్ కావచ్చేమో కానీ, నిజ జీవితంలో మాత్రం గ్రేట్ హీరో సర్’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కోలాటం ఆడుతోన్న సాయాజీ షిండే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.