Telangana Municipal Election Results: ఒక్క ఓటు మ్యాజిక్‌.. అభ్యర్థుల జీవితాలనే మార్చేసింది..!

Telangana Municipal Election Results: ఒక్క ఓటు మ్యాజిక్‌.. అభ్యర్థుల జీవితాలనే మార్చేసింది..!


పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్‌కట్‌గా ఉంది. రూలింగ్ పార్టీకే జైకొట్టింది. నంబర్ల విషయంలో నో కన్‌ఫ్యూజన్. కానీ, పట్టణ ఓటరు మాత్రం పెద్ద పజిలే పెట్టేశాడు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు, అలాగని ఏ పార్టీనీ నిరుత్సాహపర్చలేదు మున్సిపల్ ఫలితం. ఓవరాల్‌గా పురపోరు ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది. టోటల్‌గా అధికారపార్టీకి అనుకూలంగా వచ్చింది పట్టణ ఓటరు తీర్పు.

మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే, అందులో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 చోట్ల గెలిస్తే, 33 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు సమానమైన సీట్లు వచ్చి హంగ్ ఏర్పడింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అనూహ్యంగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. బీజేపీ మాత్రం ఎక్కడా బోణీ కొట్టలేదు. ఎన్నికల ఓట్లు లెక్కింపు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. విజయం అభ్యర్థుల మధ్య దోబూచులాడింది. కొన్ని చోట్ల అభ్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు తిరిగి ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో చాలామంది ఒక్క ఓటు తేడాతో కొందరికి పీఠాన్ని తెచ్చి పెట్టగా, అదే ఒక్క ఓటు కొందరికి పదవిని దూరం చేసింది. ఒక్క ఓటుతో గట్టెక్కిన వారు సంబురాల్లో, ఓటమిపాలైన వారు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో మొదట ఒక ఓటుతో ఒకరిని గెలుపొందినట్లు మొదట ప్రకటించారు. అయితే, రీకౌంటింగ్‌​లో మరొకరికి అనుకూలంగా రిజల్ట్​ వచ్చింది. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ, బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ మధ్య గెలుపు దోబుచులాడింది. మొదట కౌంటింగ్ నిర్వహించగా జయమ్మకు 464 ఓట్లు, వెంకటమ్మకు 465 ఓట్లు వచ్చాయి. ఒక ఓటుతో జయమ్మ గెలుపొందినట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ డిమాడ్‌తో రీకౌంటింగ్ చేయగా గెలుపు తారుమారైంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మపై ఒక ఓటు తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఇక మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని18వ వార్డులో మొత్తం 2,241 ఓట్లకు గానూ 1,711 పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద సైదులుకు 837 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు 836 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్‌లోనూ అదే పునరావృతం కావడంతో సైదులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు అధికారిక ప్రకటన తీవ్ర ఉత్కంఠ రేపింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, బీఆర్ఎస్ అభ్యర్థి కానుగు యాదమ్మ బాలరాజు రీకౌంటింగ్ కోరారు.ఒక్క ఓటు మిస్సింగ్ కారణంగా మూడోవసారి రీకౌంటింగ్ తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ఒకానొక దశలో కౌంటింగ్ సెంటర్‌లో బీఆర్ఎస్ – కాంగ్రెస్ నాయకుల మధ్య హోరా హోరీ మాటల యుద్ధం నడిచింది. చివరికి టాస్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసర్ల మంజుల గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. మొత్తం 836 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి సుభద్రకు 366 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రజనికి 368 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 3 పోస్టల్‌ ఓట్లు రాగా.. అవన్నీ సుభద్రకే పడటంతో ఆమె ఒక్క ఓటుతో గెలుపొందినట్లు ముందుగా అధికారులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి రజని రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. అయినా సుభద్రనే విజయం వరించింది.

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడకంటి హరిత(ఇందు) ఒక్క ఓటు మెజారిటీతో గట్టెక్కారు. హరితకు 366 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రావుకు 365 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన హరిత, ఈ ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచి ఊపిరి పీల్చుకున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లలిత, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతికి సమానంగా 253 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు డ్రా తీయగా బీఆర్​ఎస్​ అభ్యర్థి లలిత విజేతగా ప్రకటించారు. తూప్రాన్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ ఎస్ అభ్యర్థి సత్య లింగంకు 331 ఓట్లు, ఇండిపెండెంట్​ అభ్యర్థి గజ్జెల కృష్ణకు 330 ఓట్లు వచ్చాయి. సత్యలింగం ఒక ఓటుతో విజయం సాధించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి గజ్జెల కృష్ణ రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. దీంతో మరోసారి ఓట్లను లెక్కించగా ఒక ఓటు చెల్లుబాటు కాలేదు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 330 ఓట్ల చొప్పున వచ్చాయి. ఎన్నికల అధికారులు టాస్ వేసి బీఆర్ఎస్ అభ్యర్థి సత్యలింగంను విజేతగా ప్రకటించారు. దుబ్బాక మున్సిపాలిటీలోని మూడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లవ్వ, బీజెపీ అభ్యర్థి శ్రీలతకు సమానంగా 266 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ జరిపినా తేడా లేకపోవడంతో టాస్ వేయడంతో ఎల్లవ్వను విజయం వరించింది.

వనపర్తి జిల్లా కొల్లాపూర్‌ మున్సిపాలిటీలోని 2వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయలక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సమీప బీఆర్​ఎస్​ అభ్యర్థికి 354 ఓట్లు రాగా విజయలక్ష్మికి 355 ఓట్లు వచ్చాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్​ అభ్యర్థి ఎజాజ్.. బీఆర్​ఎస్​ అభ్యర్థిపై ఒక్క ఓటుతో గెలుపొందారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అభ్యర్థులిద్దరికీ సమానంగా 258 ఓట్లు వచ్చాయి. ఒక బ్యాలెట్​ పేపర్‌​పై కొంచెం అటు ఇటుగా ఉన్న గుర్తును స్కేల్​ పెట్టి మరీ కొలిచిన ఎన్నికల అధికారులు కాంగ్రెస్ అభ్యర్థి ఎజాజ్​ విజయం సాధించినట్లు ప్రకటించారు. నాగర్​కర్నూల్​ మునిసిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసిన ముమ్మడి జయలక్ష్మి రీకౌంటింగ్​లో 2 ఓట్లతో గెలుపొందారు.

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్‌లో అధికారులు రీకౌంటింగ్‌ చేపట్టగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఖాజాసనాకు, ఏఐఎఫ్‌బీ అభ్యర్థి బాలసాని తిరుపతికి సమాన ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్ల కింద పక్కన పెట్టిన 4 ఓట్లను బయటకు తీసి పరిశీలించగా అందులో రెండు చెల్లుబాటవుతాయని ప్రకటించారు. దీంతో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి తిరుపతి రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *