Telangana: శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా.. గుడికి వచ్చి పడగవిప్పిన నాగుపాము

Telangana: శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా.. గుడికి వచ్చి పడగవిప్పిన నాగుపాము


మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తజనసందోహంతో కిక్కిరిసిపోయాయి. భక్తులు శివనామస్మరణతో పరవశించిపోయారు. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. దస్తురాబాద్ మండలంలోని గొడిసెర్యాల గ్రామంలో శ్రీ రాజా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా.. ఒక్కసారి ఆలయ ప్రాంగణంలో నాగుపాము పత్యేక్షమైంది. పడగవిప్పి అది చాలా సేపు అక్కడే ఉండి.. ఆ తంతు అంతా గమనించింది. దీంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.  శివుడు నాగుపాము రూపంలో దర్శనం ఇచ్చాడని భక్తులు మొక్కులు చెల్లించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *