ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ సమయంలో ఆటగాళ్లను వారి కుటుంబాలతో ఉండనివ్వకూడదనే ప్రస్తుత విధానానికే కట్టుబడి ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నిర్ణయించింది. టీం ఇండియా ఆటగాళ్లు అభ్యర్థనలు చేసినా.. బీసీసీఐ మాత్రం ఒప్పుకోలేదు. ప్రధాన టోర్నమెంట్ల కోసం ఇప్పటికే అమలులో ఉన్న మార్గదర్శకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించకూడదని బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ల రిక్వెస్ కూడా ఒప్పుకోలేదంట.
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన తర్వాత విదేశీ పర్యటనలతోపాటు, కీలక టోర్నమెంట్ల సమయంలో ఫ్యామిలీతో కలిసి ఉండడంపై బీసీసీఐ కఠినమైన నియమాలను జారీ చేసింది. అధికారిక విధానం ప్రకారం, ఆటగాళ్ళు తమ కుటుంబాలను 14 రోజుల వరకు తమతో తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. అయితే పర్యటన 45 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటుంది.