Team India: ఇచ్చిన ఛాన్స్‌లు చాలు.. ఇక పక్కన పెట్టండి.. బ్యాడ్‌లక్ ప్లేయర్‌ను ఏకిపారేసిన లిటిల్ మాస్టర్..

Team India: ఇచ్చిన ఛాన్స్‌లు చాలు.. ఇక పక్కన పెట్టండి.. బ్యాడ్‌లక్ ప్లేయర్‌ను ఏకిపారేసిన లిటిల్ మాస్టర్..


Sanju Samson vs Ishan Kishan: టీ20 ప్రపంచకప్ తుది జట్టులో సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్.. ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందనే చర్చకు సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో ముగింపు పలికారు. భారత్, న్యూజిలాండ్ మధ్య తిరువనంతపురంలో జరిగిన చివరి మ్యాచ్ సందర్భంగా, గవాస్కర్ భారత జట్టు ఆలోచనా విధానం ఎలా ఉందో, ఎవరికి మొండిచేయి ఎదురుకాబోతుందో స్పష్టం చేశారు.

“సెలక్షన్ కమిటీ సంజూ శాంసన్‌కు అన్ని అవకాశాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్, అలాగే తిలక్ వర్మ తిరిగి వచ్చే అవకాశం ఉండటంతో బ్యాటింగ్ ఆర్డర్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది” అని స్టార్ స్పోర్ట్స్ చర్చలో గవాస్కర్ అన్నారు. న్యూజిలాండ్‌పై ఇషాన్ కిషన్ సాధించిన తొలి టీ20 సెంచరీ అతని వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, జట్టు సెలక్షన్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు ఒక సమాధానం కూడా. అతని 103 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ భారత్ 271 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలకంగా నిలిచింది.

సంజూ శాంసన్ ఫామ్ – ఆందోళన కలిగించే గణాంకాలు..

మరోవైపు సంజూ శాంసన్ గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేసి అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. పేపర్ మీద సంజూ వికెట్ కీపర్‌గా ఉన్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో కిషన్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడం ఒక సంకేతంలా కనిపించింది. ప్రపంచకప్ లాంటి కీలక సమయంలో ఇలాంటి మార్పులు కేవలం ప్రయోగాలు మాత్రమే కావు.

“ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడం చాలా కష్టం. ఒకవేళ పక్కన పెట్టినా ఎవరి కోసం పెడతారు? తిలక్ వర్మ ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్నాడు. సంజూ శాంసన్ కూడా ప్రతిభావంతుడే కానీ ప్రస్తుతం అతను ఫామ్‌లో లేడు. ఇది అతని సామర్థ్యం గురించి కాదు, ప్రపంచకప్ వంటి టోర్నీలలో మనం రిస్క్ తీసుకోలేము. ఐదు మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 24 మాత్రమే. అతను అవుట్ అవుతున్న తీరు చూస్తుంటే ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తోంది. తిలక్ వర్మ ఫిట్‌గా ఉంటే, ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ తుది జట్టులో ఉండటం నేను చూడాలని కోరుకోవడం లేదు” అంటూ తెలిపాడు.

కిషన్ జోరు – తిలక్ వర్మ రాక..

తిలక్ వర్మ గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లకు సిద్ధమవుతుండటంతో, భారత బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు ఒక స్థిరమైన రూపానికి వచ్చింది. తిలక్ రాకతో జట్టుకు సమతుల్యత దొరుకుతుంది, తద్వారా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పూర్తిగా వాడుకునే అవకాశం ఉంటుంది.

న్యూజిలాండ్ సిరీస్‌లో కిషన్ 215 పరుగులు చేసి, సూర్యకుమార్ యాదవ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో అతను ఆడుతున్న దూకుడు టీమ్ ఇండియాకు ఎంతో అవసరం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను విజేతగా నిలిపినప్పటి నుంచి కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

సంజూ శాంసన్ కెరీర్‌లో ఇది మరో విరామంగా కనిపిస్తుండగా, ఇషాన్ కిషన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కనిపిస్తోంది. గవాస్కర్ వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *