Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే

Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే


Sahibzada Farhan : టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభం నుంచే సంచలనాలకు వేదికవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తన అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 220 పరుగులు చేసిన ఈ ఆటగాడు, ఇప్పుడు ఏకంగా టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ సృష్టించిన ఆల్-టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేస్తాడా? అనే చర్చ ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఈ టోర్నీలో ఫర్హాన్ బ్యాటింగ్ తీరును చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. నెదర్లాండ్స్‌పై 47 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన అతను, అమెరికాపై 73 పరుగులతో విరుచుకుపడ్డాడు. అయితే భారత్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో మాత్రం హార్దిక్ పాండ్యా వేసిన మొదటి ఓవర్‌లోనే డకౌట్ అయి నిరాశపరిచాడు. కానీ ఆ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోతూ నమీబియాపై చారిత్రాత్మక సెంచరీతో సత్తా చాటాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా ఫర్హాన్ రికార్డు సృష్టించాడు. ఈ ఫామ్‌తోనే అతను సూపర్-8 లోకి అడుగుపెట్టాడు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2014 సీజన్‌లో కోహ్లీ 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 319 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 12 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. అయితే, ప్రస్తుతం ఫర్హాన్ ఖాతాలో 220 పరుగులు ఉన్నాయి. కోహ్లీ రికార్డును సమం చేయాలంటే అతనికి ఇంకా 99 పరుగులు, బ్రేక్ చేయాలంటే 100 పరుగులు కావాలి. పాకిస్థాన్ సూపర్-8 లో కనీసం 3 మ్యాచ్‌లు ఆడుతుంది కాబట్టి, ఫర్హాన్‌కు ఈ మైలురాయిని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ పాక్ సెమీస్ లేదా ఫైనల్‌కు చేరితే, ఈ రికార్డు సరికొత్త స్థాయిలో నమోదవ్వడం ఖాయం.

పాకిస్థాన్ సూపర్-8 షెడ్యూల్ ఇదే

సూపర్-8 రౌండ్‌లో పాకిస్థాన్ కఠినమైన సవాళ్లను ఎదుర్కోబోతోంది

ఫిబ్రవరి 21: న్యూజిలాండ్‌తో తొలి సమరం.

ఫిబ్రవరి 24: ఇంగ్లాండ్‌తో రెండో పోరు.

ఫిబ్రవరి 28: శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్.

ఈ మూడు మ్యాచ్‌ల్లో టాప్-2 లో నిలిస్తేనే పాక్ సెమీఫైనల్ చేరుకుంటుంది. జట్టు గెలుపోటముల సంగతి పక్కన పెడితే, వ్యక్తిగత రికార్డుల పరంగా ఫర్హాన్ దూకుడు చూస్తుంటే కోహ్లీ రికార్డు గజగజ వణుకుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *