Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం
ప్రముఖ అన్నమాచార్య సంకీర్తనల గాయకుడు, స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంచి 2006 వరకు సుదీర్ఘ కాలం ఆస్థాన గాయకుడిగా సేవలందించారు. ఆయన 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు అద్భుతమైన స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చి వాటికి జీవం…