మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడారు. ప్రభుత్వాధినేతలు, సుప్రీంకోర్టు మూగజీవాలపై సరైన విధానం తీసుకోలేదని వారు వాపోయారు. తెలంగాణలో వందలాది కుక్కలు, కోతులను దారుణంగా చంపేస్తున్నారని వారు ఆరోపించారు….