Oval Test : సిరీస్ డ్రా అయితే.. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఏ జట్టుకు దక్కుతుంది?

Oval Test : సిరీస్ డ్రా అయితే.. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఏ జట్టుకు దక్కుతుంది?


Oval Test :2007లో పటౌడీ ట్రోఫీ పేరుతో ప్రారంభమైన భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు 2025 నుంచి అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా పేరు మార్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదో టెస్టులో టీమ్ ఇండియా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఒకవేళ సిరీస్ డ్రా అయితే ఆ ట్రోఫీ భారత్‌కు దక్కుతుందా, లేక ఇంగ్లాండ్‌కు ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ అభిమానులందరినీ వేధిస్తోంది.  భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగుతోంది. ఈ మ్యాచ్ గెలిచి టీమ్ ఇండియా సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకునే అవకాశం ఉంది. క్రికెట్ నియమాల ప్రకారం.. ఒక సిరీస్ డ్రా అయితే గతంలో ఏ జట్టు ఆ సిరీస్‌ను గెలిచిందో ఆ జట్టే ట్రోఫీని తిరిగి దక్కించుకుంటుంది. ఈ నియమం ప్రకారం 2025లో జరుగుతున్న ఈ సిరీస్ డ్రా అయితే అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఇంగ్లాండ్ జట్టుకే దక్కుతుంది.

భారత జట్టు చివరిసారిగా 2021లో ఇంగ్లాండ్‌కు వెళ్ళినప్పుడు ఆ సిరీస్ కూడా 2-2తో డ్రా అయింది. ఆ సమయంలో అంతకు ముందు 2018లో జరిగిన సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1తో గెలుచుకుంది కాబట్టి ట్రోఫీ ఇంగ్లాండ్ దగ్గరే ఉండిపోయింది. అదే నియమం ఇప్పుడు కూడా వర్తిస్తుంది. గత సిరీస్ ఫలితాల ఆధారంగా ట్రోఫీ ఎవరికి దక్కుతుందో నిర్ణయిస్తారు.

ఓవల్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత కెప్టెన్‌లు ఇప్పటివరకు ఇద్దరే. ఈ జాబితాలో చేరి చరిత్ర సృష్టించే అవకాశం ఇప్పుడు శుభ్‌మన్ గిల్‌కు లభించింది. ఈ ఘనత సాధించిన మొదటి కెప్టెన్ అజిత్ వాడేకర్. ఆయన సారథ్యంలో భారత్ 1971లో ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయం సాధించింది. ఆ తర్వాత ఓవల్‌లో భారత్ గెలవడానికి ఏకంగా 50 ఏళ్లు పట్టింది. 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌ను 157 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

ఇప్పుడు 2025లో జరుగుతున్న ఈ కీలకమైన టెస్టులో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ గెలిస్తే, ఓవల్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మూడో భారత కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టిస్తాడు. ఈ గెలుపు భారత క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సిరీస్ డ్రా అయినప్పటికీ గెలుపు రుచిని చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిరీస్ ట్రోఫీ గెలిచే అవకాశం ఇంగ్లాండ్‌కు ఉన్నప్పటికీ, ఓవల్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 2-2తో ముగించగలిగితే, అది టీమ్ ఇండియాకు ఒక పెద్ద విజయం అవుతుంది. ఈ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంటున్న కొద్దీ అభిమానుల ఉత్కంఠ మరింత పెరుగుతోంది. శుభ్‌మన్ గిల్ తన కెప్టెన్సీలో ఈ మైలురాయిని చేరుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని  క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *