కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారు. ప్రజా వైద్యం.. సంక్షేమానికి పెద్ద పీట వేసిన కేంద్రం.. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఉన్నత విద్య కోసం పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను నిర్మిస్తామని వివరించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మూడు కొత్త ఎయిమ్స్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. పశువైద్య కళాశాలలకు లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ సపోర్ట్ స్కీమ్ తీసుకురానునట్లు తెలిపారు. ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనస్థీషియా వంటి 10 విభాగాలలో లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణులను సృష్టించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా వారసుడు పుట్టిన వేళ.. బాక్సాఫీస్ వార్కు రెడీ అవుతున్న చిరు-బాలయ్య
సెంచరీలు కొట్టే వయసు.. 94 ఏళ్లకు కొత్త సినిమా ప్రకటన
Chiranjeevi: మెగా సెంటిమెంట్తో కొడుతున్న చిరంజీవి.. మరో హిట్ పక్కాన ?
బాలీవుడ్ హీరోయిన్స్ కాదు.. కేరాఫ్ టాలీవుడ్ వాళ్లు
హిట్టు కోసం అష్టకష్టాలు.. అయినా కరుణించని విజయం