కూరగాయలపై ఉండే పురుగుమందుల అవశేషాలు సూక్ష్మక్రిములను తొలగించడానికి సాధారణ ప్రక్షాళన సరిపోదు. అందుకే సహజ సిద్ధమైన క్రిమిసంహారకాలను ఉపయోగించడం ఎంతో అవసరం. ఉప్పు, వెనిగర్ బేకింగ్ సోడా వంటి వంటింటి వస్తువులతో కూరగాయలను ఎలా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలో నిపుణులు సూచించిన ఈ 3 అద్భుతమైన హక్స్ మీకోసం.
పురుగులను పారద్రోలే 3 అద్భుతమైన మార్గాలు:
ఉప్పు గోరువెచ్చని నీరు:
ఉప్పు ఒక గొప్ప నేచురల్ డిసిన్ఫెక్టెంట్. ఒక పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో 2 టీస్పూన్ల ఉప్పు వేయండి. క్యాబేజీ లేదా కాలీఫ్లవర్ ముక్కలను ఈ నీటిలో 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. ఉప్పు ప్రభావానికి ఆకుల మధ్య దాక్కున్న కీటకాలు బయటకు వచ్చేస్తాయి. తర్వాత రెండుసార్లు చల్లని నీటితో కడగాలి.
వెనిగర్ మ్యాజిక్:
బ్యాక్టీరియా చిన్న పురుగులను చంపడంలో వెనిగర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక భాగం తెల్ల వెనిగర్ను మూడు భాగాల నీటితో కలిపి, ఆ ద్రావణంలో కూరగాయలను 5-10 నిమిషాలు ఉంచండి. ఇది పురుగుమందుల (Pesticides) ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
బేకింగ్ సోడా ద్రావణం: ఒక లీటరు నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి. ఈ నీటిలో ఆకుకూరలను 10 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల వాటిపై ఉండే రసాయనాలు క్రిములు పూర్తిగా తొలగిపోతాయి.
సరిగ్గా శుభ్రం చేయడం ఎలా?
పై పొరలు తొలగించండి: క్యాబేజీ పైన ఉండే 2-3 పొరలలోనే ఎక్కువ ధూళి, పురుగులు ఉంటాయి. కాబట్టి వాటిని ముందుగానే తీసేయాలి.
ముక్కలుగా కోయండి: క్యాబేజీని మొత్తం కడగడం కంటే, 2 లేదా 4 పెద్ద ముక్కలుగా కట్ చేసి వేడి నీటిలో వేయడం వల్ల లోపల చిక్కుకున్న పురుగులు సులభంగా బయటకు వస్తాయి.
కడగడం మర్చిపోకండి: వేడి నీటి చికిత్స తర్వాత వెంటనే సాధారణ చల్లని నీటితో కడిగితే ఆకులు వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. కూరగాయలను వండే ముందు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.