కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.
హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
సినీరంగంలోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇటీవలే మలయాళంలో కొత్త లోక అనే సినిమా చేసింది.
కొత్త లోక సినిమా మంచి విజయం సాధించడంతో కళ్యాణి పేరు మరోసారి మారుమ్రోగింది. ఇదిలా ఇప్పుడు కళ్యాణి గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో తన క్రేజీ ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి.




