IND Vs PAK: పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో టెన్షన్.. ఆ 3 లోపాలు సరిదిద్దుకోకపోతే అస్సామే.!

IND Vs PAK: పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో టెన్షన్.. ఆ 3 లోపాలు సరిదిద్దుకోకపోతే అస్సామే.!


IND Vs PAK: పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో టెన్షన్.. ఆ 3 లోపాలు సరిదిద్దుకోకపోతే అస్సామే.!

టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై భారీ విజయం సాధించినప్పటికీ, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌ ముందు టీమిండియాలో మూడు ప్రధాన లోపాలను అధిగమించాలి. మరి అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం.. మొదటిది, మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడటం. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమవడం, ఒత్తిడిలో వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌కు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి ఇది పెద్ద బలహీనత కావచ్చు.

రెండోది, డెత్ ఓవర్లలో బ్యాటర్ల వైఫల్యం. 16 ఓవర్లకు 184 పరుగులు చేసిన భారత్, చివరి నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. రింకూ సింగ్, శివమ్ దూబే లాంటి ఫినిషర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కీలక మ్యాచ్‌లలో ఈ చివరి పరుగులే గెలుపోటములను నిర్ణయిస్తాయి. మూడోది, పేస్ బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ ఫామ్ లేమి. నమీబియాపై 3 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి వికెట్ తీయకపోవడం జట్టుకు నష్టం. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ లాంటి పాక్ ఓపెనర్లను కట్టడి చేయాలంటే బూమ్రాపైనే కాకుండా అర్షదీప్ కూడా రాణించడం చాలా ముఖ్యం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బ్యాటింగ్ ఆర్డర్, డెత్ ఓవర్ వ్యూహాలను మెరుగుపరుచుకోవడం అత్యవసరం.

నమీబియాపై గెలిచి సూపర్ ఎయిట్‌లో దాదాపు బెర్త్ ఖాయం చేసుకున్నప్పటికీ, పాకిస్తాన్‌తో జరిగే హై వోల్టేజ్ పోరులో ఈ పొరపాట్లు రిపీట్ అయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు ఫ్యాన్స్. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో బ్యాటింగ్ ఆర్డర్‌ను సెట్ చేయడంతో పాటు, డెత్ ఓవర్ల వ్యూహాలను మెరుగుపరుచుకోవాలి. కొలంబో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, భారత బ్యాటర్లు దీనికి తగ్గట్లుగా మెంటల్‌గా సిద్దం కావాలంటున్నారు. ఫిబ్రవరి 15న జరిగే ఈ కీలక పోరులో టీమిండియా ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *