Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. ఏకంగా లక్షమార్కు దాటిన పసిడి ధరలు.. నాన్స్టాప్గా పెరుగుతూనే ఉన్నాయి.. ఏకంగా లక్షా 3 వేల రూపాయల మార్క్ దాటిన.. స్వచ్ఛమైన పసిడి ధర సరికొత్త రికార్డును తిరగరాసింది. ఇక వెండి ధర కూడా అదే స్థాయిలో భారీగా పెరిగింది. కాగా.. ఆదివారం (ఆగస్టు 10) ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆగస్టు 10 2025 ఉదయం ఆరు గంటలకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశియంగా బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 1,03,040 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.94,450 గా ఉంది.
వెండి ధర కిలో ధర రూ.1,17,000 లుగా ఉంది.
అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,03,040 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.94,450 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,27,000 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,03,040, 22 క్యారెట్ల ధర రూ.94,450 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,27,000 గా ఉంది.