Gold Price Today: అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత వారం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చినప్పటికి ప్రస్తుతం భారీగా పెరుగుతోంది. అయితే ఫిబ్రవరి11న దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం పై కేవలం వంద రూపాయలు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,790 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,560 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు (24,22 క్యారెట్లలో ధరలు):
- హైదరాబాద్లో రూ. 1,58,790, రూ. 1,45,560
- విజయవాడలో రూ. 1,58,790, రూ. 1,45,560
- ఢిల్లీలో రూ. 1,58,940, రూ. 1,45,710
- ముంబైలో రూ. 1,58,790, రూ. 1,45,560
- చెన్నైలో రూ. 1,58,790, రూ. 1,45,560
- బెంగళూరులో రూ. 1,58,790, రూ. 1,45,560
- కోల్కతాలో రూ. 1,58,790, రూ. 1,45,560
- కేరళలో రూ. 1,58,790, రూ. 1,45,560
మరోవైపు వెండి ధరలో రూ.4 లక్షల వరకు వెళ్లిన వెండి.. తాజాగా స్వల్పంగా తగ్గింది. కిలో పై కేవలం 100 రూపాయలు మాత్రమే తగ్గింది. హైదరాబాద్లో కిలోకు రూ.2,99,900 వద్ద ట్రేడవుతోంది. విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అలాగే ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద ఉంది.
Indian Railways: మార్చి 1 నుండి నిలిచిపోనున్న రైల్వేలు UTS యాప్.. ఇక అన్ని సేవలు అందులోనే..!
ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో అత్యవసర బెర్త్లు ఉంటాయని మీకు తెలుసా? వాటిని ఎవరెవరికి కేటాయిస్తారు? నియమాలేంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి