ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రథసప్తమి వేడుకల సందర్భంగా నిర్వహించిన వందలాది డ్రోన్ల ప్రదర్శన నగర వాసులను మంత్రముగ్ధులను చేసింది. డ్రోన్లు క్రమపద్ధతిలో ఎగిరి రంగురంగుల వెలుగులతో ప్రత్యేక ఆకృతులను ఆవిష్కరించి జిల్లా విశిష్టతను చాటిచెప్పాయి. ప్రదర్శన ప్రారంభంలోనే ఆకాశంలో ‘సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు 2026’ అనే అక్షరాలు మెరిసాయి. భానుడి రథం, సూర్యభగవానుడి దివ్య రూపం, అష్టలక్ష్మి స్వరూపం లక్ష్మీదేవి ఆకారం కనిపించాయి. 75 ఇయర్స్ ఆఫ్ శ్రీకాకుళం, ‘పలాస…