Hyderabad: రూ.26 వేలకే కారు అంటూ ప్రచారం.. పోటెత్తిన జనం.. ఆ తర్వాత..
రిపబ్లిక్ డే సందర్భంగా 26 వేలకే కారు అంటూ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఓ అడ్వర్టైజ్మెంట్ హైదరాబాద్ మల్లాపూర్లో కలకలం సృష్టించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్కు చెందిన రోషన్ తన ట్రస్ట్ కార్స్ షోరూంలో 50 కార్లు ఆ ధరకు విక్రయిస్తానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఈ ప్రచారాన్ని నమ్మిన స్థానికులు సోమవారం తెల్లవారుజామునే భారీ సంఖ్యలో షోరూం వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ కేవలం 10 కార్లు మాత్రమే ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.మోసం…