బల్గేరియన్ భవిష్యత్ ప్రవక్త బాబా వంగాను తరచుగా ‘బాల్కన్ల నోస్ట్రాడమస్’ అని పిలుస్తారు. ఆమెను ప్రపంచంలో జరిగే ముఖ్య సంఘటనలను ముందే ఊహించగల ప్రతిభా వంతురాలిగా పేర్కొన్నారు. బాబా వంగా అంచనాలు వివాదాస్పదంగా ఉన్నా కూడా.. మానవజాతి ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రపంచ పరిస్థితుల కారణంగా ప్రతీ సంవత్సరం ఆమెను గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఆమె జోస్యం మళ్లీ చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే ఆమె ప్రకారం, మానవజాతి అంతానికి ఒక నిర్దిష్ట సంవత్సరం ఇప్పటికే నిర్ణయించబడింది.
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది?…
బాబా వంగా ప్రకారం.. మానవతా అంతిమ విధ్వంసం 5079 సంవత్సరంలో జరగబోతుంది. ఆ సంవత్సరంలో, “ఊహించలేని స్థాయిలో” ఒక విశ్వ సంఘటన జరిగి, మానవజాతి, విశ్వానికి సంపూర్ణ విధ్వంసం తెస్తుంది. ఆమె ప్రవచనంలో మానవ పరిణామం, సాంకేతిక పురోగతి, ఘర్షణలు, అంతిమ విధ్వంసం అనుసరిస్తూ వివరించబడి ఉన్నాయి.
బాబా వంగా ప్రధాన అంచనాలు:
3005: మంగళ గ్రహంపై యుద్ధం.
3010: చంద్రుని ఢీకొనడం.
3797: భూమిపై జీవం అంతరించిపోవడం.
4300: మానవతా సాంకేతిక, నైతిక అభివృద్ధి; అన్ని వ్యాధుల నయం.
4674: నాగరికత తన శిఖరానికి చేరడం; అనేక గ్రహాలపై 340 బిలియన్ల జనాభా.
5079: మానవతా, విశ్వానికి “సంపూర్ణ విధ్వంసం”.
చివరి దశల్లో, మానవులు విశ్వాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తారు, కానీ 5079 లో ఈ ప్రయత్నాలు, లేదా మరే ఇతర విపత్తు, “సంపూర్ణ విధ్వంసం”కు దారితీస్తుంది.
2026 సంవత్సరానికి బాబా వంగా అంచనాలు:
మూడవ ప్రపంచ యుద్ధం: ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించారు. చైనా–తైవాన్ వివాదం, రష్యా–యునైటెడ్ స్టేట్స్ ప్రత్యక్ష ఘర్షణ సాధ్యమని చెప్పబడింది.
ప్రకృతి వైపరీత్యాలు: తీవ్ర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు.
గ్రహాంతర సంబంధాలు: మానవులు అంతరిక్ష జీవులతో సంబంధం ఏర్పరచే ప్రయత్నాలు 2026లో ఫలించవచ్చని సూచించారు. కాగా, బాబా వంగా వ్రాతపూర్వక రికార్డులు వదిలిపెట్టలేదు. ఆమె అంచనాలను.. ఆమె మేనకోడలు క్రాసిమిరా స్టోయనోవా లేదా ఆమె మరణం తర్వాత శిష్యుల ద్వారా రికార్డులు చేశారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)




