
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మొదటి రోజు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ పనిదినాలు, బడ్జెట్ తేదీలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి మొదటి వారం వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈనెల 14న బడ్జెట్ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాగా.. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అదినేత జగన్ సహా.. ఎమ్మెల్యేలు హాజరయ్యారు.