ఎంతో మంది లోన్లు తీసుకొని.. ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు. అలా ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి గుడ్న్యూస్.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంపీఎల్ఆర్) ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. ఈ తగ్గింపుతో హొం లోన్, కారు లోన్లు, పర్సనల్ లోన్ల ఈఎంఐలపై ఈ తగ్గింపు అమలు కానుంది.