ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తు, ఆగస్టు 8 ఉదయం ఆరుగంటల నుంచి ఆగస్టు 10 రాత్రి మరకు మహిళలకు యూపీఎస్ ఆర్టీసీ , సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించారు. అలాగే పండగ రద్దీని నివారించడానికి పల్లెల్లో, పట్టణాల్లో అదనపు బస్సులను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇలా యూపీ మహిళలకు రాఖీ పండగ సందర్భంగా మూడు రోజుల పాటు ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.