తెలియకుండానే చాలా మంది ఉప్పుకు అడెక్ట్ అయిపోతున్నారు. వంటల్లో రుచి కోసం అతిగా ఉప్పు తీసుకుంటున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. who నివేదిక ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు. కానీ దీని కంటే ఎక్కువ మొతాదులో ఉప్పు తీసుకోవడం వలన ఇది అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, మూత్రపిండాల సమస్యలను తీసుకొస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వలన ఇది శరీరాన్ని తెలియకుండానే తినేస్తుంది. అధిక ఉప్పు అనేది శరీరంలో సోడియం మోతాదును విపరీతంగా పెంచుతుంది. దీని వలన రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. అందువలన వీలైనంత వరకు చాలా తక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవాలంట. కానీ చాలా మంది తమకు తెలియకుండానే,10 గ్రాముల ఉప్పు తీసుకుంటుందంట.
బయటి ఫుడ్, పాపడ్, పకోడి, ఫర్సాన్, స్నాక్స్, చిప్స్ వంటి వాటిల్లో అధిక ఉప్పు ఉంటుంది. కానీ చాలా మంది తమకు తెలియకుండా వీటిని తిని శరీరంలో సోడియాన్ని పెంచుకుంటున్నారు. దీని వలన మూత్ర పిండాల పనితీరు బలహీనపడటం, దృష్టి సమస్యలు, గుండె నాళాల పొడవు తగ్గడం, ఒంట్లో వాపులు, శరీంలో నీటి నిల్వ పెరగడం, జీర్ణ సమస్యలు, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయంట.
పైకి చూస్తే వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ ఇదిలోలపల మాత్రం ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుందంట. అందువకే వీలైనంత వరకు ఉప్పును తగ్గించుకోవాలని చెబుతున్నా వైద్యులు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే అతిగా ఉప్పు తీసుకోవడం వలన ఇది గుండె జబ్బుల సమస్యను పెంచుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.