మన దేశంలోని యువత విదేశాలకు వెళ్లాలని అక్కడ చదువుకోవాలని.. మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. అయితే మన దేశంలోని విశ్వవిద్యాలయాలంటే విదేశీయులకు కూడా ఇష్టమని.. కొంతమంది విదేశీ నాయకులు భారతదేశంలో చదువుకుని ఆ తర్వాత తమ తమ దేశాలలో ఉన్నత పదవులు నిర్వహించారని మీకు తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్రికా వరకు.. ఒకప్పుడు మన దేశంలో విశ్వవిద్యాలయాల్లో చదువుకుని తరువాత తమ దేశానికి అధ్యక్షుడు, ప్రధానమంత్రి అయిన చాలా మంది నేతలున్నారు. కొందరు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయాలను అభ్యసించారు. కొందరు పరిశోధన చేశారు. కొందరు సైనిక శిక్షణ తీసుకోవడానికి భారతదేశానికి వచ్చారు. అలాంటి కొంతమంది ప్రత్యేక వ్యక్తుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
హమీద్ కర్జాయ్ (ఆఫ్ఘనిస్తాన్)
హమీద్ కర్జాయ్ భారతదేశంలోని సిమ్లాలో యునివర్సీటీ నుంచి అంతర్జాతీయ సంబంధాలు రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1957 డిసెంబర్ 24న కాందహార్లో జన్మించిన కర్జాయ్ 2004 నుంచి 2014 వరకు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లో హమీద్ కర్జాయ్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మొదటి సారిగా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అంతకు ముందు అతను దేశ అంతర్గత నాయకుడిగా పనిచేశారు.
ఆంగ్ సాన్ సూకీ (మయన్మార్)
ఆంగ్ సాన్ సూకీ మయన్మార్ దేశానికి చెందిన రాజకీయ నాయకురాలు, మానవ హక్కుల కార్యకర్త. ఆంగ్ సాన్ సూకీ భారతదేశంలోని ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుంచి రాజకీయాలలో పట్టభద్రురాలయ్యారు. దీని తరువాత ఆమె 1967లో తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం అభ్యసించారు. 1968లో ఆక్స్ఫర్డ్లోని సెయింట్ హ్యూస్ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్ను అభ్యసించారు. తరువాత 1985 నుంచి 1987 వరకు, ఆంగ్ సాన్ సూకీ లండన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)లో పరిశోధన విద్యార్థిగా బర్మీస్ సాహిత్యంలో M.Phil. పట్టా పొందారు. ప్రపంచవ్యాప్తంగా నాయకత్వంలో తనను తాను నిరూపించుకున్న ఆంగ్ సాన్ సూకీ 1991లో శాంతికి నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు.
బింగు వా ముతారిక (మలావి, ఆఫ్రికా).
బింగు వా ముతారిక ఆఫ్రికన్ దేశమైన మలవికి చెందిన ఒక రాజకీయవేత్త . ఆర్థికవేత్త. బింగు వా ముతారికా కూడా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి పట్టభద్రులయ్యారు. దీని తరువాత ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మలావి బింగు వా ముతారికా 1961 నుంచి 1966 వరకు 2004 నుంచి 2012 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 2010లో ఢిల్లీకి వచ్చిన ముతారికా ఒక తెలివైన విద్యార్థి. ఆయన 2004 నుంచి 2012లో మరణించే వరకు మలవి అధ్యక్షుడిగా పనిచేశారు.
ఒలుసెగున్ ఒబాసంజో (నైజీరియా)
ఒలుసెగున్ ఒబాసాంజోకు భారతదేశంతో ప్రత్యేక సంబంధం ఉంది. ఆయన భారతదేశంలో సైనిక శిక్షణ పొందారు. మొదట పూణే సమీపంలోని కిర్కీ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్లో శిక్షణ పొందారు. తరువాత వెల్లింగ్టన్ (తమిళనాడు)లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో తదుపరి శిక్షణను పూర్తి చేశారు. ఆయన 1999 నుంచి 2007 వరకు నైజీరియాకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడిగా ఉన్నారు. దీనికి ముందు, ఆయన 13 ఫిబ్రవరి 1976 నుంచి 1 అక్టోబర్ 1979 వరకు నైజీరియా సైనిక పాలకుడు కూడా.
బాబూరామ్ భట్టరాయ్ (నేపాల్)
నేపాల్ మాజీ ప్రధాన మంత్రి బాబూరామ్ భట్టరాయ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి టెక్నాలజీలో MTech డిగ్రీని పొందారు. ఆయన 1986లో న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి అర్బన్ ప్లానింగ్లో PhD పట్టా పొందారు. ఆయన ఆగస్టు 2011 నుంచి మార్చి 2013 వరకు నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్నారు.