PM Kisan scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎం కిసాన్ పథకం) కింద 20వ విడతగా రూ.20,500 కోట్లను విడుదల చేశారు. 9.7 కోట్లకు పైగా రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2,000 బదిలీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ పిఎం కిసాన్ డబ్బును విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Health Tips: ఘాటుగా ఉన్నాయని దూరం పెట్టకండి.. రోజు రెండు రెబ్బలు తింటే ఈ వ్యాధులు పరార్..!
ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి?
ఇవి కూడా చదవండి
రైతులకు వ్యవసాయంలో సహాయం అందించడానికి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2,000 ఉచితంగా సహాయం అందిస్తుంది. సంవత్సరానికి రూ. 6,000 విడుదల చేస్తుంది. 2019లో కేంద్రం ఈ స్కీమ్ను ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 20 వాయిదాలు విడుదల చేసింది కేంద్రం.
ఈ స్కీమ్కు ఎవరు అర్హులు?
వ్యవసాయ భూమి ఉన్న ఏ రైతు అయినా ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుగా మారడానికి అర్హులు.
ఎవరు అనర్హులు?
కింది రైతులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నప్పటికీ, ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు అర్హులు కాదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కుటుంబంలో రాజ్యాంగ పదవిలో ఉన్నవారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పంచాయతీ చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, ప్రస్తుత లేదా మాజీ సభ్యులకు ఈ పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉండదు. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి నుండి బదిలీ చేయబడిన భూమిని కలిగి ఉన్న పిల్లలకు కూడా PM కిసాన్ డబ్బు అందదు. కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి పీఎం కిసాన్ రాదు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి వస్తుంది.
పీఎంకిసాన్ పథకానికి అర్హత కలిగి ఉండి, నమోదు చేసుకున్నప్పటికీ eKYC చేయని రైతులకు డబ్బు అందదు. లేదా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోతే డబ్బు అందదు. ఆధార్ ద్వారా eKYCతో పాటు భూమి పత్రాలను తిరిగి సమర్పించడం తప్పనిసరి. ఇది చేయకపోతే కిసాన్ డబ్బు రాదు.
ఇది కూడా చదవండి: AP School Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్.. పాఠశాలలకు భారీగా సెలవులు.. విద్యార్థులకు పండగే..!
ఇది కూడా చదవండి: Medicine Price: సామాన్యులకు భారీ ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం.. 35 రకాల మందుల ధరలు తగ్గింపు!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి