Sundar Pichai : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగుతోంది. సిరీస్లో 1-2తో వెనుకబడిన టీమ్ ఇండియా, సిరీస్ను సమం చేయడానికి పోరాడుతోంది. ఇంగ్లాండ్ జట్టు కూడా విజయం కోసం కృషి చేస్తోంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ను చూడటానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టును ప్రోత్సహించడానికి డగౌట్లో కనిపించాడు. అయితే, అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ మ్యాచ్ను చూడ్డానికి వచ్చారు. అంతేకాదు, కొద్దిసేపు కామెంటరీ బాక్స్లో కూర్చుని కామెంటరీ కూడా చెప్పారు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో, టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కామెంటరీ బాక్స్లో కనిపించారు. ప్రఖ్యాత కామెంటేటర్ హర్ష భోగ్లేతో కలిసి ఆయన కొద్దిసేపు కామెంటరీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్యం, క్రికెట్పై ఉన్న ప్రేమ గురించి పంచుకున్నారు.తాను చిన్నప్పటి నుండి క్రికెట్ అభిమానినని పిచాయ్ చెప్పారు. తన బెడ్రూమ్లో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పోస్టర్లను అంటించుకునేవాడినని గుర్తు చేసుకున్నారు.
A surprise in the commentary box 🤩
Google CEO Sundar Pichai joins Harsha Bhogle for a short commentary stint 😲#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @bhogleharsha @sundarpichai pic.twitter.com/ZmI4jtulwd
— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2025
తన అభిమాన క్రికెటర్లు అవుట్ అవడం చూసి తట్టుకోలేక, తాను ఎప్పుడూ లైవ్ మ్యాచ్లు చూసేవాడిని కాదని ఆయన చెప్పడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. సుందర్ పిచాయ్ కామెంటరీ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మతో పాటు ఇతర క్రికెటర్లు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
మ్యాచ్ విషయానికి వస్తే, తొలి ఇన్నింగ్స్లో 23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత జట్టు, ఇంగ్లాండ్కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ సెంచరీ, ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు చేసి జట్టు భారీ స్కోరు సాధించడానికి సహాయపడ్డారు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు కూడా పోరాడుతోంది. ప్రస్తుతం గేమ్ ఎవరి వైపు మొగ్గుతుందో చెప్పడం కష్టం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..