
వాట్సాప్.. ఇప్పుడు ముచ్చట్లన్నీ దీంట్లోనే. చదువురాని వారు సైతం ఈ యాప్ను ఈజీగా వాడుతున్నారు. అంతలా ప్రజల జీవితంలో ఒక భాగమై పోయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సాప్ మరోసారి కొత్త ఫీచర్ను తీసకరానుంది. వాట్సాప్ తన వినియోగదారుల కోసం రెండు కొత్త ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. ముఖ్యంగా టెలిగ్రామ్, స్నాప్చాట్, బిట్చాట్లకు పోటీగా ఈ ఫీచర్ను తీసుకువస్తుంది. అంతేకాకుండా యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని చెబుతోంది.
కాల్ రిమైండర్ ఫీచర్..
కొన్ని సార్లు బిజీగా ఉండడం వల్ల వాట్సప్ కాల్స్కు ఆన్సర్ ఇవ్వలేకపోతాం. ఆ తర్వాత కాల్ బ్యాక్ చేయడం కూడా మర్చిపోతాం. ఇటువంటి సమస్యకు చెక్ పెడతూ వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.22.5లో టెస్ట్ చేస్తోంది. దీంట్లో మీరు మిస్డ్ కాల్స్ కోసం రిమైండర్లను సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. 2 గంటలు, 8 గంటలు, 24 గంటల రిమైండర్ సెట్ చేసుకుని కాల్కు మర్చిపోకుండా ఆన్సర్ చేయొచ్చు.
ఈ ఫీచర్ ఎందుకు..?
చాలాసార్లు మనం కాల్ మిస్ చేసి తర్వాత ఎవరికి తిరిగి కాల్ చేయాలో మర్చిపోతాము. కానీ ఇకపై అలా జరగదు. మీరు ఎవరికి తిరిగి కాల్ చేయాలో వాట్సాప్ స్వయంగా మీకు గుర్తు చేస్తుంది.
ప్రొఫైల్ అప్డేట్ ఫీచర్..
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్తో యూజర్స్ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ నుండి నేరుగా ప్రొఫైల్ ఫోటోను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ డీపీని వాట్సాప్లో ఉంచాలనుకుంటే.. ఆ ఫోటోను గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఫోటోను సెలక్ట్ చేసుకుంటే వాట్సాప్లో ప్రొఫైల్ అప్డేట్ అయిపోతుంది. ఇది సమయాన్ని ఆదా చేయడంతో పాటు ప్రక్రియను సులభతరం అవుతుంది. ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే యూజర్లకు ఇవి అందుబాటులోకి వస్తాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..