భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అంతేకాక ఎన్నో పర్యాటక ప్రాంతాలకు ఎంతో ప్రసిద్ధి. ఎన్నో ఆధ్యాత్మిక, ఆకర్షణీయ ప్రదేశాలకు నెలవు ఈ భారతదేశం. ఇక్కడ ఎన్నో సముద్ర తీరప్రాంతాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో నీలి రంగు బీచ్లు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో కొన్ని నీలిరంగు నీరు ఎక్కువ మంది ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ నీటి రంగు ఉండే బిచ్ల గురించి తెలుసుకుందాం.
రాధానగర్ బీచ్, అండమాన్: మీరు వేసవిలో అండమాన్లోని ఈ బీచ్ తప్పకుండా వెళ్లాలి. ఇక్కడి నీలిరంగు నీరు పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ బీచ్ 2004లో దేశంలోని 7 అత్యుత్తమ బీచ్లలో ఒకటిగా ఉంది.
ఘోఘ్లా బీచ్, డామన్ అండ్ డయ్యూ: భారతదేశంలోని ఈ బీచ్ వాటర్ స్కూటర్ పారాసైలింగ్ వంటి సాహస కార్యకలాపాలను కలిగి ఉంది. అయినప్పటికీ బీచ్ ఎంతో శుభ్రంగా కనిపిస్తుంటుంది. ఇక్కడికి వెళ్లి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
శివరాజ్పూర్ బీచ్, గుజరాత్: ఇది గుజరాత్లోని అత్యంత అద్భుతమైన బీచ్లలో ఒకటి. రుక్మిణి మందిర్ నుండి కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ పర్యటకుల సందడి ఉంటుంది. దీన్ని మీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి. ఇక్కడ మంచి ఫోటోలు దిగవచ్చు.
గోల్డెన్ బీచ్, ఒడిషా: ఒడిశాలోని ఈ గోల్డెన్ బీచ్ భారతదేశంలోని పరిశుభ్రమైన బీచ్లలో ఒకటి. ఈ నీలిరంగు బీచ్ ఒడ్డున మీరు మీ పిల్లలతో కలిసి ఆనందంగా గడపవచ్చు. ఈ బీచ్ను చూస్తే అక్కడి నుంచి వెళ్లాలని అనిపించదు.