18 ఫిబ్రవరి 1996న కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడాలో జన్మించింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. పరమేశ్వరన్ ఎరెక్కత్, సునీత పరమేశ్వరన్ దంపతులు ఈ వయ్యారి తల్లిదండ్రులు. ఆమెకు అక్షయ్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.
కేరళలోని ఇరింజలకుడాలో డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ. కొట్టాయంలోని CMS కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ల గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో సినిమా ఛాన్స్ రావడంతో దీన్ని మధ్యలో వదిలేసింది.
2015లో నివిన్ పౌలీతో కలిసి ప్రేమమ్ అనే మలయాళీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. అది కమర్షియల్గా విజయం సాధించింది. జేమ్స్ & ఆలిస్ అడల్ట్ ఇసాబెల్ (పింకీ) పాత్ర చేసింది. కోడి సినిమాతో తమిళంలో తొలిసారి నటించింది.
2016లో నితీన్ సమంత జంట నటించిన అఆ అనే చిత్రంలో నాగవల్లి అనే పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. దీనికి జీ సినీ అవార్డ్స్ తెలుగు వారిచే గర్ల్ నెక్స్ట్ డోర్ అవార్డును కైవసం చేసుకుంది. అదే ఏడాది తెలుగు ప్రేమమ్ సినిమాలోనూ ఓ హీరోయిన్ గా నటించింది. దీనికి IIFA ఉత్సవం ఉత్తమ సహాయ నటి – తెలుగు అవార్డు అందుకుంది.
2017లో శతమానం భవతి చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది. తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, కార్తికేయ 2 లాంటి మరికొన్ని తెలుగు హిట్ చిత్రాల్లో కధానాయికగా నటించింది. గత ఏడాది తెలుగు ఈగల్, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది కోలీవుడ్ మూవీ డ్రాగన్లో ఆకట్టుకుంది.
ప్రస్తుతం తెలుగులో పరదా సినిమా చేస్తుంది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మలయాళంలో జానకి v/s స్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ సినిమాలు చేస్తుంది. తమిళంలో బైసన్, లాక్డౌన్ చిత్రాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ.