బీహార్ పోలీసులు తమ వింత చర్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. కొన్ని రోజుల క్రితం, దర్భాంగా జిల్లాలోని ఒక గ్రామంలో 200 మందిపై SC/ST చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు రోహ్తాస్ నుండి ఇలాంటి కేసు బయటపడింది. అక్కడ పోలీసులు 9 ఏళ్ల బాలుడిపై SC/ST చట్టం కింద కేసు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి జువెనైల్ జస్టిస్ బోర్డు విచారించినప్పుడు, బోర్డు సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారు నవ్హట్టా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని పిలిపించి, ఆ చిన్నారిపై SC/ST చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆదేశించారు. అలాగే పూర్తి సంఘటనకు సంబంధించి 24 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఈ కేసు రోహ్తాస్ జిల్లాలోని నవ్హట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 2025 డిసెంబర్ నెలలో, పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో కొంతమంది పిల్లల మధ్య వివాదం చెలరేగింది. అది ఘర్షణకు దారితీసింది. పిల్లలలో ఒకరి తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఐదుగురిపై ఎస్సీ,ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, 9 ఏళ్ల బాలుడిపై ఎస్సీ/ఎస్టీ చట్టం ప్రయోగించారు. ఈ కేసులో బాలుడు మైనర్ కావడంతో దానిని జువెనైల్ జస్టిస్ బోర్డు విచారించాల్సి వచ్చింది. ఫిబ్రవరి 19న, ఆ బాలుడిని పోలీసులు జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపర్చారు. బోర్డు మేజిస్ట్రేట్ అమిత్ కుమార్ పాండే, సభ్యులు తేజ్ బాలి సింగ్ ఆ బాలుడి వయస్సు చూసి ఆశ్చర్యపోయారు.
బాల నేరస్థుడి వయస్సు 9 నుండి 10 సంవత్సరాల మధ్య ఉంటుందని జువెనైల్ జస్టిస్ బోర్డు అంచనా వేసింది. బాల నేరస్థుడిపై ఎస్సీ/ఎస్టీ చట్టం విధించడం పట్ల జువెనైల్ బోర్డు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసులో దాఖలు చేసిన పోలీసు నివేదికలోని అనేక కాలమ్లు ఖాళీగా కనిపించాయి. ఏ కాలమ్లోనూ బాల నేరస్థుడి వయస్సు, వయోజన నిందితుడి వయస్సులు పేర్కొనలేదు. బాల నేరస్థుడి కేసు నుండి ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని తొలగించాలని జువెనైల్ బోర్డు జస్టిస్ ఆదేశించారు. నవహట్టా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నుండి 24 గంటల్లోకా వివరణ కోరింది.
ఈ మొత్తం సంఘటన గురించి నవహట్టా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ నుండి సమాచారాన్ని కోరినట్లు జువెనైల్ జస్టిస్ బోర్డు పేర్కొంది. ప్రతిస్పందన సంతృప్తికరంగా లేకుంటే, ఈ విషయాన్ని సీనియర్ జిల్లా అధికారులతో చర్చిస్తామని తెలిపింది. ఇది SC/ST చట్టం స్పష్టమైన దుర్వినియోగమని జువెనైల్ జస్టిస్ బోర్డు పేర్కొంది. పిల్లల మధ్య గొడవకు సంబంధించి ఫిర్యాదు నమోదైందని నవహట్టా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ పేర్కొన్నారు. దాడి, దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. అందుకే FIR నమోదు చేశామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. బాలుడిపై SC/ST చట్టం కింద ఎలా కేసు నమోదు చేశారో మేము దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..