
మన వంటింట్లో దొరికే శనగపిండి మీ ముఖంలో కోల్పోయిన మెరుపును తిరిగి పొందడంతో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. చర్మంపై ఉన్న మలినాలను శుభ్రపరచడానికి, అలాగే జిడ్డును, చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. శనగ పిండిని క్రమం తప్పకుండా, సరిగ్గా ఉపయోగించడం వల్ల చర్మం స్పష్టంగా, మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. మెరిసే చర్మాన్ని త్వరగా పొందేందుకు మీకు సహాయపడే నాలుగు సులభమైన, ప్రభావవంతమైన శనగ పిండి చిట్కాలను మేము ఇప్పుడు చెప్పబోతున్నాం.
శనగపిండి పసుపు ఫేస్ ప్యాక్: ఈ ఫేస్ తయారీ కోసం మీరు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని, చిటికెడు పసుపు, కొద్దిగా పాలు లేదా రోజ్ వాటర్ వేసి పేస్ట్లా తయారు చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్ ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత, దానిని సున్నితంగా రుద్ది శుభ్రమైన నీటితో కడగండి. తర్వాత మృదువైన క్లాత్ సున్నితంగా ముఖాన్ని తుడవండి దీన్ని అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి మచ్చలు తేలికవుతాయి. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
శనగపిండి, పెరుగు ప్యాక్: మీకు పొడి చర్మం ఉంటే, 2 టీస్పూన్ల శనగపిండిని 1 టీస్పూన్ పెరుగుతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. కావాలనుకుంటే, మీరు కొన్ని చుక్కల తేనెను కూడా జోడించవచ్చు. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని తేమ చేస్తుంది, సహజమైన మెరుపును తెస్తుంది.
శనగపిండి, నిమ్మకాయ మాస్క్: ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మం ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసేందుకు 2 టీస్పూన్ల శనగపిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ను మీ ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయండి. ఇది అదనపు నూనె, టానింగ్ను తగ్గించడంలో సహాయపడుతుంది.
శనగపిండి, టమోటా ప్యాక్: టాన్ అయిన లేదా ఎండలో కమిలిన చర్మానికి, టమాటా రసంతో శనగ పిండిని కలిపి పూయడం చాలా మంచిది. టమాటా రసం, శనగ పిండి మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని శుభ్రంగా, తాజాగా ఉంచుతుంది. దాని మెరుపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ , నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి..వీటినీ TV9 దృవీకరించట్లేదు)
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.