కుంభం: ఈ రాశిలో రవి, రాహువులు, సింహ రాశిలో చంద్ర, కేతువుల కలయిక జరుగుతున్నందు వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ రెండు రోజులు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల అనుకున్నవన్నీ సాధించే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. అనారోగ్యాల నుంచి బయట పడతారు. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. పెన్షన్లు, బీమా సొమ్ము, వారసత్వపు ఆస్తి వంటివి చేతికి అందుతాయి.