ఆమె ఒకప్పుడు ఫేమస్ నటి.. తన అందంతో.. అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. తమిళ్తో పాటు.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ అందాల భామ. ఆమె ఎవరో కాదు విజయ లక్ష్మీ..! తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో హీరోల చెల్లిగా నటించింది. అలాగే తమిళ్ లో పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా చేస్తూ.. మొన్నటివరకూప్రేక్షకులను అలరించింది. సినిమాలతో కంటే ఆమె ఎక్కువ తన వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలిచింది. ఆమధ్య తాను మోసపోయానంటూ రోడ్డుకెక్కారు. నటుడు, దర్శకుడు, రాజకీయనాయకుడు అయిన ఓ ప్రబుద్ధుడు తనను లైగింకంగా వాడుకున్నారంటూ.. ఏకంగా ఏడు సార్లు తనకు అబార్షన్ చేయించాడంటూ.. ఆరోపిస్తూ.. సూసైడ్ అటెంప్ట్ చేసి వార్తల్లో నిలిచింది.
తన కామెంట్స్ తో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో సంచలనంగా మారారు. ఇక అసలు విషయం ఏంటంటే..! నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత, నటుడు, దర్శకుడు అయిన సీమాన్ పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేస్తూ.. మరో సారి మీడియా ముందుకు వచ్చారు నటి విజయలక్ష్మీ. గతంలో ఆయనపైనే చేసిన ఆరోపణలకు తోడుగా.. ఈ సారి మరింత పదునుగా.. సీమాన్ పై విరుచుకుపడ్డారు. తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన విజయలక్ష్మి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న బాధలను గురించి ఆవేదన వ్యక్తం చేసింది.
నాకు నరకం అంటే ఏమిటో చూపించారు అంటూ ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ఏడు సార్లు గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యారు విజయలక్ష్మీ. సీమాన్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, తనను మానసికంగా, శారీరకంగా లొంగదీసుకున్నాడని విజయలక్ష్మి ఆరోపణలు చేశారు. ఈ మోసం వల్ల ఆమె ఏడు సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. “అప్పటి నుంచి నాకు నరకం ఏమిటో చూపించడం మొదలుపెట్టాడు. దాదాపు ఏడు సార్లు గర్భస్రావం చేయించుకోమని బలవంతం చేశాడు” అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.2011లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి సీమాన్పై లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు చేసింది. ఈ కేసులో సీమాన్ నుంచి ఆమె పెద్ద మొత్తంలో డబ్బు కూడా అందిందని వార్తలు వచ్చాయి. మానసిక ఒత్తిడి, బెదిరింపుల కారణంగా ఆమె తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ కోలీవుడ్ లో దీని గురుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి