ఆవు పులి కథ నిజ జీవితంలో నిజమైంది. తన బిడ్డను కాపాడుకోవడానికి పులికి ఆహారం అయేందుకు సైతం సిద్దమైన ఓ ఆవు కథ పురాణాల్లో ప్రత్యేకంగా నిలిస్తే.. ఈ కలియుగంలో తన బిడ్డను పొట్టన పెట్టుకున్న పులి జాడను చూపి.. బిడ్డ కళేబరాన్ని తిరిగి ఇంటికి చేర్చుకుంది ఓ ఆవు. దట్టమైన అడవిలో పులి దాడికి బలైన లేగ దూడ మృతదేహాన్ని అటవి అధికారులకు చూపి తల్లి ప్రేమను చాటుకుంది. ఈ ఘటన ఆసిపాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాలపహాడ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పులి దాడిలో మరణించిన తన దూడ కళేబరం వద్దకు ఓ ఆవు అటవీ అధికారులను తీసుకెళ్లింది. ఆదివారం ఆవుల మంద అటవీ ప్రాంతంలోకి మేత కోసం వెళ్లింది. ఈ క్రమంలో ఆవు, దూడతో మేత మేస్తున్నాయి. అయితే..అప్పటికే అక్కడ మాటు వేసిన ఓ పులి ఆవుల మందపై దాడికి దిగింది. ఈ దాడిలో లేగ దూడను హతమార్చింది పులి..
వీడియో చూడండి..
దీంతో భయపడిన ఆవు పెద్దగా అరుస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటి దారి పట్టింది. లేగ దూడ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన యాజమాని ఆవు వద్దకు వెళ్లగా.. ఆ ఆవు అడవి వైపు యజమానిని తీసుకెళ్లింది. అడవిలో లేగ దూడ చనిపోయిన ప్రాంతాన్ని యజమానికి చూపించింది. తిరిగి ఇంటికి వచ్చిన యజమాని అటవిశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆవు.. మరోసారి పులి దాడి చేసిన ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులకు చూపించింది.
వీడియో చూడండి..
లేగ దూడ మృతదేహాన్ని పరిశీలించిన అటవి సిబ్బంది.. సమీప ప్రాంతంలో పులి పాద ముద్రలను గుర్తించారు. పులి దాడిలోనే లేగ దూడ మృతి చెందినట్టుగా తేల్చారు. ఆవు తన బిడ్డను కాపాడుకోవడంలో చేసిన ప్రయత్నాన్ని చూసి ఆశ్చర్య పోయారు అటవిశాఖ అధికారులు.. తల్లి ప్రేమ కంటే గొప్పది ఏది లేదని నిరూపించింది ఆ గోమాత.. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..