ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ అయినా లేదా నార్మల్ ఫోన్ అయినా వాటి ఛార్జర్లు మాత్రం ఒకే రంగులో ఉంటాయి. నలుపు లేదా తెలుగు రంగులోనే ఛార్జర్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ రెండు రంగుల్లోనే ఛార్జర్లు ఎందుకు ఉంటాయనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది. దానికి సమాధానాలు ఇందులో చూద్దాం.
ఫోన్ ఛార్జింగ్ అయ్యే సమయంలో చార్జర్లలో వేడి పెరుగుతోంది. సాధారణంగా తెలుపు, నులుపు రంగులు వేడిని కంట్రోల్ చేస్తాయి. వేడి బయటకు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. వేడి ఎక్కువైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణంతో ఛార్జర్లను ఈ రెండు రంగుల్లోనే తయారు చేస్తారు.
ఇక నలుపు లేదా తెలుపు ప్లాస్టిక్ వాడితే ఛార్జర్లకు తయారీ ఖర్చు తగ్గుతుంది. అలాగే ఛార్జర్లు తయారు చేసే క్రమంలో సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్ వంటి టెస్టులు చేయాల్సి ఉంటుంది. తెలుపు లేదా నలుపు రంగుల్లో వాటిపై పడే మచ్చలు, పొగ గుర్తులు, కరిగిన భాగాలను ఈజీగా గుర్తించవచ్చు. దీని వల్ల ఛార్జర్లలోని లోపాలు సులువుగా బయటపడతాయి.
అయితే ఛార్జర్లకు వాడే ఈ రెండు రంగులు ఇప్పటికే భద్రతా సంస్థల నుంచి ఆమోదం పొందాయి. ఇప్పుడు కొత్త రంగులను వాడిటే అనుమతి రావడానికి సమయం పడుతుంది. మళ్లీ కొత్తగా టెస్టులు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల చార్జర్ల ఉత్పత్తికి సమయం పట్టే అవకాశం ఉంటుంది.
ఇక తెలుపు, నలుపు ఛార్జర్లు ఫోన్ కలర్కు సెట్ అవుతాయి. ఏ ఫోన్ కలర్కు అయినా ఇవి సరిపోతాయి. ఛార్జర్లు తెలుపు, నలుపు రంగులో తయారు చేయడానికి ఇది కూడా ఒక రీజన్. భద్రత, వేడిని కంట్రోల్ చేయడం, అనుమతుల ప్రక్రియ ఉండటంతో ఇప్పటికీ ఛార్జర్లను ఈ రెండు రంగుల్లోనే తయారు చేస్తున్నారు




