ఫిబ్రవరి 17, 2026న మాఘ మాసం, కృష్ణపక్ష అమావాస్య తిథి నాడు రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కుంభ రాశిలో చంద్రుడు ధనిష్ఠా నక్షత్రం నాలుగో పాదంలో ఉండగా, పంచగ్రహ కూటమితో ఏర్పడటం విశేషం. ప్రముఖ జ్యోతిష్యులు చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ ప్రకారం, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించదు, కనిపించదు. అందువల్ల, భారతదేశంలో గ్రహణ నియమాలు, గ్రహణ దోషాలు పాటించాల్సిన అవసరం లేదు. దేవాలయాలను మూసివేయాల్సిన పని లేదు. అయితే, పశ్చిమ దేశాలలో, అంటార్కిటికా సముద్రంలో, ఇండియన్ ఓషన్ లోని కొన్ని ప్రాంతాలలో దీని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, చిలీ వంటి దేశాలలో ఈ గ్రహణం మధ్యాహ్నం 3:26 నిమిషాల నుంచి సాయంత్రం 7:57 నిమిషాల మధ్య కనబడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముక్తిని ప్రసాదించే పంచారామ క్షేత్రాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత
మహాశివరాత్రి రద్దీలో చోరీ.. కీసరగుట్టలో రెచ్చిపోయిన దొంగలు
అర్ధరాత్రి వేళ భక్తుడి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది
Bhainsa Municipality: 20 ఏళ్ల తర్వాత భైంసాలో గెలిచిన బీజేపీ
Adilabad Municipality: ఆదిలాబాద్లో కుర్చీ కోసం కలిసిపోయిన అన్ని పార్టీలు