మొన్నామధ్య అన్నమయ్య జిల్లాలో ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి స్మగ్లింగ్ను చేధించారు. ఓ ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా.. ఉల్లిపాయల బస్తాల కింద గంజాయి ఉండడం చూసి పోలీసులు షాకయ్యారు. సుమారు 179 కేజీల గంజాయి పట్టుబడింది.
ఇప్పుడు అన్నమయ్య జిల్లా స్మగ్లర్ల రేంజ్ను మించిపోయేలా.. విశాఖలో కాస్త డిఫరెంట్గా గంజాయి స్మగ్లింగ్కు తెర లేపారు కొందరు కంత్రీగాళ్లు. ఇళ్లలో దర్వాజాల దగ్గర వేసుకునే మ్యాట్ల మాటున గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న అల్లూరి జిల్లా వంజంగి గ్రామానికి వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లోని లగేజ్ స్కానర్లో మ్యాట్ మధ్యలో గంజాయి బ్యాగులను చూసి రైల్వే పోలీసులు షాకయ్యారు. మూడు మ్యాట్ బండిల్స్ను ముగ్గురు కూలీలతో రైల్వేస్టేషన్లోకి తెస్తుండగా పట్టుకున్నారు. మ్యాట్ల ముసుగులో తరలిస్తున్న సుమారు 60కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి.. ముంబయికి తరలిస్తున్నట్లు గుర్తించారు.
మరోవైపు అల్లూరి జిల్లా జీ.మాడుగుల మండలంలో గంజాయి బ్యాచ్ను పట్టుకున్నారు విశాఖ పోలీసులు. మత్స్యపురం దగ్గర పోలీసుల తనిఖీల్లో కోటి విలువైన గంజాయి పట్టుబడింది. బొలోరా వాహనంలో తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.