Vande Bharat: ఈ ప్రాంత ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఈ రెండు మార్గాల్లో వందే భారత్‌ నిలిపివేత!

Vande Bharat: ఈ ప్రాంత ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఈ రెండు మార్గాల్లో వందే భారత్‌ నిలిపివేత!


Vande Bharat Express: భారత రైల్వే చరిత్రలో వందే భారత్ రైళ్లు కొత్త మైలురాయిని సాధించాయి. ఈ సెమీ-హై-స్పీడ్ సర్వీస్ దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రారంభించింది. అలాగే మరిన్ని మార్గాల్లో కూడా ప్రారంభం కానుంది. అయితే రెండు మార్గాల్లో ప్రయాణికులకు నిరాశ కలిగించే వార్తలు వస్తున్నాయి. రెండు మార్గాల్లో వందే భారత్ సేవను నిలిపివేయాలని రైల్వేలు నిర్ణయించాయి. ఉదయపూర్- అహ్మదాబాద్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే బోర్డు ఆమోదించింది. ఉదయపూర్ నుండి జైపూర్, ఆగ్రా వరకు ఉన్న రెండు మార్గాలు నిలిపివేసేందుకు నిర్ణయించింది.

నార్త్ వెస్ట్రన్ రైల్వే ప్రకారం.. ఉదయపూర్ నగరం నుండి బయలుదేరే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ వారం నిలిచిపోనున్నాయి. రైలు నంబర్ 20981/82 (ఉదయపూర్ నగరం-ఆగ్రా కాంట్-ఉదయపూర్ నగరం) ఫిబ్రవరి 15, 2026 నుండి నిలిపివేయనుంది రైల్వే. రైలు నంబర్ 20979/80 (ఉదయపూర్ నగరం-జైపూర్-ఉదయపూర్ నగరం) ఫిబ్రవరి 14, 2026 నుండి నిలిచిపోయింది.

ఇది కూడా చదవండి: Taxi Services: మీరు ట్యాక్సీ బుక్‌ చేసుకుంటున్నారా..? మీకో గుడ్‌న్యూస్‌..!

ఇవి కూడా చదవండి

  • 20979/20980 – ఉదయపూర్ – జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • 20981/20982 – ఉదయపూర్ – ఆగ్రా కాంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

భారత రైల్వే రాజస్థాన్ – గుజరాత్‌లను కలుపుతూ కొత్త రైలును ప్రారంభించింది. ఈ కొత్త సర్వీసు వారానికి ఆరు రోజులు ఉదయపూర్, అహ్మదాబాద్ సమీపంలోని అసర్వా మధ్య నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హౌరా, కామాఖ్య మధ్య దేశంలోని మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను గౌహతిలో జెండా ఊపి ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. రైలు నంబర్ 26963 ఉదయపూర్ నగరం నుండి ఉదయం 6:10 గంటలకు బయలుదేరి ఉదయం 10:25 గంటలకు అసర్వా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 26964 సాయంత్రం 5:45 గంటలకు అసర్వా నుండి బయలుదేరి రాత్రి 10:00 గంటలకు ఉదయపూర్ నగరానికి చేరుకుంటుంది.

ఇది కూడా చదవండి: ఉడకబెట్టిన గుడ్ల పొట్టు సులభంగా రావాలంటే ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్‌

రెండు వందే భారత్ రైళ్లను ఎందుకు నిలిపివేశారు?

ఈ నిర్ణయానికి రైల్వే శాఖ స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. మీడియా నివేదికల ప్రకారం ఈ రైళ్లలో అందుబాటులో ఉన్న సీటింగ్ సామర్థ్యాన్ని తీర్చడానికి తగినంత మంది ప్రయాణికులు లేకపోవడం వల్లే సర్వీసును నిలిపివేయాలనే నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.

భారతదేశం అంతటా వందే భారత్ సేవ

లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, వందే భారత్ సర్వీస్ ఫిబ్రవరి 2019లో ప్రారంభమైందని, ప్రస్తుతం 82 రూట్లలో 164 రైళ్లను నడుపుతున్నామని తెలిపారు. ఈ రైళ్లలో మెరుగైన సస్పెన్షన్, సెమీ-హై-స్పీడ్ ఆపరేషన్, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, ఎర్గోనామిక్ సీటింగ్, మినీ ప్యాంట్రీలు, సీసీటీవీ, కవచ్ సేఫ్టీ సిస్టమ్ వంటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: Income Tax: పాన్‌, ఆధార్‌ ఉన్న వారికి ఆదాయపు పన్ను శాఖ మరో హెచ్చరిక.. అదేంటంటే..

ఇది కూడా చదవండి: మీకు ఆధార్‌ కార్డు ఉందా..? ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *