మహా శివరాత్రి నాడుఏమేం చేయాలి? జాగరణ నియమాలు ఇవే!

మహా శివరాత్రి నాడుఏమేం చేయాలి? జాగరణ నియమాలు ఇవే!


మహా శివరాత్రి పర్వదినం మాఘమాసంలో వచ్చే పవిత్రమైన చతుర్దశి. ఈ రోజున భక్తులు ప్రత్యేక పూజలు, ఆరాధనలు ఆచరిస్తారు. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేదా సాయంత్రం, రాత్రి లింగోద్భవానికి పూర్వం పుణ్యస్నానాలు ఆచరించడం శ్రేష్ఠం. నదీజలాల్లో, సముద్రంలో లేదా ఇంట్లో శుచిగా స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. ఈ రోజున స్వగృహంలో చిన్న శివలింగాన్ని పూజించడం లేదా పరిసర ప్రాంతాల్లో గోశాలలు, నదీ తీరాల వద్ద ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం మంచిది. ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేయించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలంలో శివాభిషేకం చేయడం అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. రాత్రివేళ చేసే ధ్యానం, అనుష్టానం, శివారాధన మోక్ష సాధనకు, జ్ఞానార్జనకు తోడ్పడతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం, జాగరణ ద్వారా ఈశ్వరుడికి సన్నిహితంగా ఉండటం మహా శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *