అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ నెల 9న కాలిఫోర్నియాలో తప్పిపోయిన సాకేత్ అనే విద్యార్థి మృతదేహం యూనివర్సిటీకి కిలోమీటర్ దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో లభ్యమైంది. అమెరికా పోలీసులు సాకేత్ మృతదేహంతో పాటు అతని బ్యాక్ప్యాక్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సాకేత్, కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సాకేత్ ట్రెకింగ్ లేదా క్యాంపింగ్ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన భారతీయ విద్యార్థుల కుటుంబాలలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం :