
రాజు అలా విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత ఆయనకు సంతాన ప్రాప్తి కలిగిందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుండి ఇక్కడ శివుడి విగ్రహానికే నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లింగాభిషేకాలు జరుగుతుంటే, హేమావతిలో మాత్రం విగ్రహ రూపంలో ఉన్న స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా, సరిహద్దు కర్ణాటక నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ‘అగ్నిగుండం’ ప్రవేశాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వేచి చూస్తారు. సంతాన ప్రాప్తి కోసం ఈ స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శిల్పకళా సంపదతో, ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతున్న హేమావతి క్షేత్రం శివరాత్రి వేళ భక్తజన సంద్రంగా మారుతుంది.
మరిన్ని వీడియోల కోసం :