సౌత్ బ్లాక్లో జరిగిన చివరి సమావేశంలో కేబినెట్ మొత్తం రూ.1.60 లక్షల కోట్ల విలువైన రైల్వే, వంతెన, ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. చారిత్రాత్మక సౌత్ బ్లాక్లో జరిగిన చివరి సమావేశంలో కేంద్ర మంత్రివర్గం రూ.1,60,504 కోట్ల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆ తర్వాత కొత్తగా నిర్మించిన సేవా తీర్థ సముదాయానికి దాని కార్యకలాపాలను మార్చాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
దాదాపు 95 సంవత్సరాల క్రితం 1931లో సౌత్ బ్లాక్ ప్రారంభించబడిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు దాని నుండి తరలిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న సేవా తీర్థాన్ని జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. గత సమావేశంలో రైల్వేలు, జాతీయ రహదారులు, మెట్రో విస్తరణ, పట్టణ సంస్కరణలు, స్టార్టప్ నిధులకు సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో తెలంగాణలోని హైవే ప్రాజెక్ట్లకు కూడా నిధులు కేటాయించారు.
ప్రధాన ఆమోదాలు
- కాసరమన్మాడ్ 3వ, 4వ రైల్వే లైన్లకు రూ. 10,154 కోట్లు
- ఢిల్లీ-అంబాల 3వ, 4వ రైల్వే లైన్లకు రూ. 5,983 కోట్లు
- బళ్లారిహోస్పేట 3వ, 4వ రైల్వే లైన్లకు రూ. 2,372 కోట్లు
- అస్సాంలోని గోహ్పూర్, నుమాలిఘర్ మధ్య బ్రహ్మపుత్ర నది కింద రోడ్డు-కమ్-రైలు సొరంగం రూ. 18,662 కోట్లు
- అర్బన్ ఛాలెంజ్ ఫండ్ రూ. 1,00,000 కోట్లు (కేంద్రం మద్దతు)
- స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 రూ.10,000 కోట్లు
- తెలంగాణలో NH-167 విస్తరణకు రూ.3,175.08 కోట్లు
- గుజరాత్లో NH-56 అప్గ్రేడ్కు రూ.4,583.64 కోట్లు
- మహారాష్ట్రలో NH-160A అప్గ్రేడ్ రూ. 3,320.38 కోట్లు
- నోయిడా మెట్రో ఆక్వా లైన్ పొడిగింపు రూ. 2,254 కోట్లు
- రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు: రూ. 18,509 కోట్లు
ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రూ.18,509 కోట్ల విలువైన మూడు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది, వీటిని 2030-31 నాటికి పూర్తి చేయనున్నారు. ఇవి ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలోని 12 జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. దాదాపు 389 కి.మీ. కొత్త లైన్ యాడ్ అవుతుంది. 26.5 మిలియన్ మానవ-రోజుల ప్రత్యక్ష ఉపాధి సృష్టించబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి