తరతరాలుగా సమాచారం, విద్య, వినోదాన్ని అందించే శక్తివంతమైన మాధ్యమంగా రేడియో నిలిచింది. ఉదయాన్నే భక్తి గీతాల నుంచి వార్తా బులెటిన్లు, ఇంటరాక్టివ్ కార్యక్రమాల వరకు దేశంలోని ప్రతి ఇంట్లో ఇది ఒక నమ్మకమైన నేస్తంగా కొనసాగుతోంది. నేటికీ చిన్న చిన్న దుకాణాలు, ఆటోరిక్షాలు, పెట్రోల్ పంపులలో రేడియో శబ్దం వినిపిస్తూనే ఉండటం సమాజంలో దానికున్న ఆదరణకు నిదర్శనం. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆరోగ్యం, సైన్స్ వంటి కీలక సమాచారాన్ని అందించడంలో రేడియో విశ్వసనీయతను చాటుకుంటోంది.రేడియోకు మళ్లీ ప్రాచుర్యం కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం రేడియోను మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..
హాస్టల్లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?