
కానీ పూర్వం కొన్ని రాజకుటుంబాల వారు తమ చర్మసౌందర్యం కోసం ఓ రహస్య తైలాన్ని ఉపయోగించేవారట. దీనివల్ల చర్మం కాంతివంతంగా యవ్వనంగా ఉంటుందట. ఈ ఆధునిక ప్రపంచంలో మరోసారి ఆ తైలం సంచలనం సృష్టిస్తోంది. ఆయుర్వేద గ్రంథాలలో ‘చర్మ సంరక్షణామృతం’గా పిలువబడే ఆ నూనె.. కేవలం కొద్ది చుక్కలతోనే మీ ముఖంపై రాజసం ఉట్టిపడేలా చేస్తుందట. అదేంటో..దానినెలా ఉపయోగించాలో తెలుసుకుందాం. కుంకుమాది అనే పేరు సంస్కృత పదమైన ‘కుంకుమ’ నుంచి వచ్చింది. కుంకుమ అంటే కుంకుమపువ్వు లేదా కేసర్ అని అర్థం. పూర్వకాలంలో రాజకుటుంబీకులు తమ ముఖం ఎప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా ఉండటానికి ఈ తైలాన్ని ప్రధానంగా ఉపయోగించేవారు. ఇది చర్మ రంధ్రాలను మూసివేయకుండా, లోపలి నుంచి శుభ్రం చేసి సహజమైన మెరుపును అందిస్తుంది. జంతువులపై ఎటువంటి పరీక్షలు చేయకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారయ్యే ఈ నూనె ఇప్పుడు మళ్ళీ అందరి ఆదరణ పొందుతోంది.