సంజు సామ్సన్ ఐపీఎల్ 2025 (IPL 2025) వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ గత సీజన్ తర్వాత అతను ఫ్రాంచైజీ నుంచి నిష్క్రమించాడనే పుకార్లు వ్యాపించడం ప్రారంభించాయి. గత వేలానికి ముందు అతను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేయగానే ఇది ధృవీకరించబడింది. అప్పటి నుంచి పరాగ్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరిస్తాడని పుకార్లు వచ్చాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, లీగ్ ప్రారంభ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ (RR), పూర్తిగా కొత్త లుక్ తో టోర్నమెంట్ లోకి అడుగుపెడుతోంది. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ తన కొత్త కెప్టెన్ ని ప్రకటించింది. సంజు శాంసన్ ఫ్రాంచైజీ నుంచి నిష్క్రమించిన తర్వాత, యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కెప్టెన్ గా నియమితులయ్యాడు. అన్ని ఊహాగానాలు, వాదనలను ధృవీకరిస్తూ, రియాన్ ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహిస్తాడని రాయల్స్ అధికారికంగా ప్రకటించింది. రేసులో రియాన్ యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజాతో సహా ఆరుగురు పోటీదారులను అధిగమించాడు.