ఇప్పుడు మన జీవితాల్లో మొబైల్ ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. ఇది లేకుండా ఒక్క నిమిషమైనా బతకలేం అన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూస్తారు. ముందుగా వాట్సాప్ మెసేజులు, స్టేటస్ లను చెక్ చేసుకుంటారు. అలాగే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్.. ఇలా సమయం అనేది తెలీయకుండా గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే గడుపుతాం. అయితే ఈ స్టార్ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ ను అవలంభిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషా సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ సామాజిక మాధ్యమాలకు చాలా దూరంగా ఉంటోందట. ముఖ్యంగా మన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ లో కీలకమైన వాట్సాప్ ను గత ఎనిమిదేళ్లుగా ఉపయోగించడం లేదట. అలాగే కాలేజీ చదువు పూర్తయినవెంటనే ఫేస్ బుక్ కు గుడ్ బై చెప్పేసిందట. ప్రస్తుతం కేవలం ఇన్ స్టాగ్రామ్ ను మాత్రమే .. అది కూడా చాలా అరుదుగా యూజ్ చేస్తోందట. వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవితమే ముఖ్యమని భావిస్తోన్న ఆ హీరోయిన్ మరెవరో కాదు రజిషా విజయన్.