తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఫేజ్ A1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు. గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు ప్రక్రియ మొదలైంది. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ అభివృద్ధి జరగనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??
Raashii Khanna: సినిమా ఛాన్స్ లేకపోతే ఏంటి.. నాకు సోషల్ మీడియా ఉందిగా అంటున్న రాశీ ఖన్నా
గోల్డెన్ ఛాన్స్.. చేతులారా నాశనం చేసుకున్నారుగా
Ranveer Singh: చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మాతలు
Pawan Kalyan: పవన్ నెక్ట్స్ మూవీ అప్డేట్.. జోడీ సెట్ అయినట్టేనా