ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యానికి మంచి అలవాటు. రాత్రి నిద్ర తర్వాత శరీరం డీహైడ్రేట్ అయిన సమయంలో నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజితమవుతుంది. అయితే చాలా మంది ఉదయాన్నే ఎంత క్వాంటిటీ నీళ్లు తాగాలో ఖచ్చితంగా తెలియక ఎవరికి తోచినట్టు వారు తాగుతూ ఉంటారు. అది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. అయితే ఉదయాన్నే ఎంత నీరు తాగాలి? ఎలా తాగాలి అనేది నిపుణుల సూచనలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం ఖాళీ కడుపుతో 1 నుంచి 2 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుంది. ఈ మొత్తం శరీరాన్ని ఉత్తేజపరిచి రోజును ప్రారంభించడానికి సరైన మొత్తంగా పరిగణించబడుతుంది. అయితే, ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడానికి బదులుగా నెమ్మదిగా, చిన్న సిప్స్లో తాగాలి. ఇది శరీరం నీటిని సరిగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కడుపుపై ఒత్తిడి పెరిగి అజీర్ణం ఏర్పడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో చాలా చల్లటి నీళ్లు తాగడం కంటే గోరువెచ్చని లేదా సాధారణ నీళ్లు తాగడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సహజంగా శరీరంలోని నీటి స్థాయిలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఉదయం నీళ్లు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ సక్రియం అవుతుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. సోమరితనాన్ని తొలగిస్తుంది. మిమ్మల్ని తాజాగా చేస్తుంది. దీనితో పాటు రోజూ ఉదయం నీళ్లు తాగే మీ ఈ అలవాటు రోజంతా తగినంత నీళ్లు తాగేందుకు ప్రోత్సహిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కష్టపడి రాళ్లతో పగలగొట్టాడు.. అంతలోనే..
రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా
బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే
CM Chandrababu Naidu: ఢిల్లీలో.. ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త